Tv424x7
Andhrapradesh

వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం

విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వన్ టౌన్ నందు ఉన్న శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారి సహకారంతో, ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. ప్రతి సంవత్సరం మూడు సార్లు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 500 మంది పాల్గొన్నారు, కంటి ఆపరేషన్లకు 50 మంది ఎన్నికయ్యారు, వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.సి .ఎం .ఎ . జహీర్ అహ్మద్ పేషెంట్లను తనిఖీ చేసి, ఉచితంగా మందులను అందించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్. కృష్ణ, చాందిని, శాంతి, సౌజన్య, లతా, క్యాంపు కోఆర్డినేటర్ వై . రాజు, సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ మహిళా సభ్యులు పాల్గొన్నారు.

Related posts

ఉగ్రవాదం వెన్ను విరిచేందుకే ఆపరేషన్ సిందూర్.. సాయుధ దళాల ప్రకటన

TV4-24X7 News

భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం

TV4-24X7 News

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డి ప్రమాణస్వీకారం

TV4-24X7 News

Leave a Comment