సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ‘సుభద్ర యోజన’ను ప్రారంభించనున్నట్లు సీఎం మోహన్ చరణ్ మాఝి తెలిపారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఈ’ పథకాన్నిప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన MPలు, MLAలకు బీజేపీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రూ.50వేలు చొప్పున గిఫ్ట్ ఓచర్ పంపిణీకి ఉద్దేశించిన సుభద్ర యోజన పథకం ప్రధాని పుట్టిన రోజున ప్రారంభిస్తామన్నారు.

previous post
next post