Tv424x7
Andhrapradesh

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

విశాఖపట్నం ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని తెలిపారు.నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గొల్లలపాలెం , వాచ్ హౌస్ జంక్షన్ పరిసరాల్లో డైనమిక్ వెహికల్ చెకింగ్ చేశామన్నారు. ఈ సందర్బంగా ఏసీపీ ట్రాఫిక్ జోన్ -I, టీసీఐ . రేవతమ్మ ఇతర పోలీస్ సిబ్బంది మైకుల ద్వారా వాహన చోదకులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. వాహన చోదకులు తప్పకుండ హెల్మెట్ ధరించాలని, కార్ డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుండా రోడ్డు పై వాహనాలు నడుపరాదని, త్రిబుల్ రైడింగ్ నేరమని, ఆటో డ్రైవర్లు ఓవర్ లోడ్ ఎక్కించరాదని కోరారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ నియమాలు పాటించిన వారికి చాకోలెటీస్ ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ ఎస్ ఐ .లక్ష్మి , ప్రసాద్ ,నిజ్జిరుధన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రైతుకు ఏటా 20వేల ఆర్థిక సాయం చేస్తాం – యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

TV4-24X7 News

నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణం..!!

TV4-24X7 News

కడప బరిలోనే షర్మిల

TV4-24X7 News

Leave a Comment