ఎవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చు
ఏపీలో మద్యం దుకాణాలకు ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధానంపై రాజీపడే పడే ప్రసక్తే లేదని మంత్రి తెలిపారు.వ్యాపారులు,ఆశావాహులు ఎవరైనా స్వేచ్ఛగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కావున దళారులను నమ్మి ఎవరు కూడా మోసపోవద్దన్నారు.