విశాఖపట్నం దసరా నవరాత్రుల సందర్భంగా, వివేకానంద సంస్థ ఆశ్రమ వాసులు, సంస్థ సభ్యులు దుర్గమ్మ తల్లిని దర్శించుకుని అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. సంస్థ నందు దుర్గమ్మ తల్లి పూజా కార్యక్రమం అతి వైభవంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి యువ నాయకులు ద్రోణంరాజు. శ్రీవత్సవ పాల్గొన్నారు. అనంతరం వివేకానంద సంస్థ ట్యూషన్ విద్యార్థులు కోలాటాన్ని చక్కగా ప్రదర్శించారు, ఈ సందర్భంగా శ్రీవాత్సవ్ మాట్లాడుతూ సంస్థ ట్యూషన్ విద్యార్థులు చదువుతో పాటు, ఆధ్యాత్మికంగా సంకీర్తనలు, కోలాటం చక్కగా ప్రదర్శించారు అని వారిని అభినందిస్తూ, వారికి బహుమతులను అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో సంస్థ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
previous post
next post

