Tv424x7
Telangana

రేపే మిస్ ఇండియా ఫైనల్ కాంపిటీషన్

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వేదికగా అంగరంగ వైభవంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే విజేత ఎవరో తెలనుంది. శనివారం మే 31న మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్ నిర్వహించనున్నారు. దీని కోసంహైదరాబాద్ హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫైనల్ నిర్వహణకు సర్వం సిద్ధం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మిస్ వరల్డ్ విన్నర్ ప్రైజ్ మనీపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు సుమారు 110కి పైగా దేశాల నుంచి సుందరీమణులు తరలి వచ్చారు. వీరిలో గ్రాండ్ ఫినాలేకు 40 మంది కంటె స్టెంట్లు ఎంపికయ్యారు. వీరిలో నుంచి ఒక్కరు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోను న్నారు. విజేతకు మిస్ వరల్డ్ కిరీటంతో పాటుగా కళ్లు చెదిరే ప్రైజ్ మనీ కూడా లభిస్తుంది. విజేతకు 1 మిలియన్ డాలర్ అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 8.5 కోట్ల రూపాయలు దక్కు తాయి. ఈ ప్రైజ్ మనీ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, ప్రధాన స్పాన్సర్ల ద్వారా లభిస్తుంది.ఇక ఫైనల్ వేడుకను వీక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. 150 దేశాల్లో మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ పోటీని లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కార్యక్రమం సజావుగా జరిగేందుకు సైబరాబాద్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నారు.మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ పోటీల్లో భాగంగా రెడ్ కార్పెట్ ఈవెంట్ శనివారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఫైనల్ పోటీ..సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై రాత్రి 9:20 గంటలకు ముగుస్తుంది. ఇక ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని వీక్షించడానికి సుమారు 3,500-4,000 మంది అతిథులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పాసులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు.

Related posts

హైదరాబాద్ లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడంటే.?

TV4-24X7 News

మాధవీ లత గెలిచే అవకాశం: ఇండియా టుడే

TV4-24X7 News

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సిద్ధం కండి: సీఎం రేవంత్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment