Tv424x7
Andhrapradesh

అనాథ మృతదేహానికి ‘రెడ్‌ క్రాస్‌’ అంత్యక్రియలు

విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న రామ్‌రాజ్‌ షోరూం వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి అచేతనంగా పడి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. గీతం కళాశాలలో చదువుతున్న గౌతం అనే విద్యార్థి ఈ మేరకు 112టోల్‌ ఫ్రీ నంబర్‌కు తెలియజేశాడు. దీంతో టూటౌన్‌ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు ఆదేశాలతో హెడ్‌కానిస్టేబుల్‌ కన్నారావు పెదవాల్తేరులోని జీవీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న రెడ్‌ క్రాస్‌ హోంలెస్‌ షెల్టర్‌ మేనేజర్‌ మురళీకి ఈ విషయాన్ని తెలియజేశారు. సిబ్బంది అక్కడకు చేరుకుని పోలీసుల సాయంతో అప్పటికే మృతి చెందిన ఆ గుర్తు తెలియని మృతదేహాన్ని జ్ఞానాపురం శ్మశాన వాటికకు తరలించారు. అనంతరం అంత్యక్రియలు జరిపించారు.

Related posts

అనంతపురం రూరల్ డీఎస్పీగా వెంకటేశ్ నియామకం

TV4-24X7 News

నాగబాబు ట్వీట్ ఎవరి కోసం?

TV4-24X7 News

సైకోను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుంది.. జగన్ పై చంద్రబాబు ఆగ్రహం

TV4-24X7 News

Leave a Comment