కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో బుధవారం అయ్యప్ప స్వామి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు దువ్వూరు అయ్యప్ప సేవ సమితి సభ్యులు , గోవింద స్వాములు తెలిపారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల నుండి స్థానిక గంగమ్మ ఆలయం నుండి దువ్వూరు పురవీధుల వెంట వినాయక స్వామి దేవాలయం వరకు ఈ గ్రామోత్సవం సాగనుంది, గ్రామోత్సవంలో అయ్యప్ప స్వామి తో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి, శివ పార్వతుల ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరుగనుంది, ఇందులో హైదరాబాద్ కు చెందిన అయ్యప్పలచే అయ్యప్ప గీతాలాపనలు, మహిళల కోలాటాలు, మంగల వాయిద్యాలతో మేలతాలల నడుమ కన్నే స్వాములతో కలశోత్సవము, పిల్లలచే దీపోత్సవము, నిర్వహించనున్నారు అనంతరం రాత్రి తోమ్మిది గంటలకు వినాయక స్వామి గుడి వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించనున్నట్లు అయ్యప్ప సేవా సమితి సభ్యులు గోవింద స్వాములు తెలిపారు.
