నేపాల్ లో రాజకీయ సంక్షోభం ముదిరింది. యువత చేపట్టిన ఆందోళనలు ఆ దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం చిచ్చు రాజేసింది. ప్రభుత్వ నిర్ణయంపై యువత భగ్గుమంది. జనరేషన్ జెడ్ యువత రోడ్డెక్కింది. ఆందోళన బాట పట్టింది. వీరి ఆందోళనలు, నిరసనలతో నేపాల్ అట్టుడికిపోయింది. ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలను అక్కడి ప్రభుత్వం తట్టుకోలేకపోయింది.
పరిస్థితి చేయి దాటిపోడం తో కేపీ శర్మ ఓలి ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కేపీ శర్మ ఓలి రాజీనామా తర్వాత నేపాల్ నెక్ట్స్ ప్రధాని ఎవరు? అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.ఈ క్రమంలో నేపాల్ తదుపరి ప్రధాని రేసులో బాలేంద్ర షా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బాలేంద్ర షా.. బాలెన్ గా సుపరిచితులు. సోషల్ మీడియాపై బ్యాన్, అవినీతిపై ఆందోళన చేస్తున్న యువతే బాలేన్ షా,కు మద్దతు పలకడం విశేషం.
ఆయనే నేపాల్ నూతన ప్రధాని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది జనరేషన్ జెడ్. ఇంతకీ ఎవరీ బాలేన్ షా? ఆయన ప్రత్యేకత ఏంటి? యువత ఆయనకు ఎందుకు మద్దతుగా నిలిచింది?
ఎవరీబాలెన్ షా…
బాలెన్ షా ప్రస్తుతం ఖాట్మండ్ మేయర్ గా వున్నారు. 1990లో కాట్మండులో జన్మించారు. ఆయన ఒకప్పుడు రాపర్. లిరిసిస్ట్ కూడా. తన పాటల ద్వారా రాజకీయ అవినీతి, సామాజిక అసమానతలపై విమర్శలు చేశారు. బలిదా న్ అనే పాటకు యూట్యూ బ్లో 7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందిన బాలెన్, 2022 లో స్వతంత్ర అభ్యర్థిగా ఖాట్మండ్ మేయర్గా ఎన్నికయ్యారు. 61వేల ఓట్లతో ఆయన ఆ ఎన్నికల్లో గెలుపొందారు.

