ప్రకాశం జిల్లా కొండపి మండలం కట్టవారిపాలెం లో బుధవారం పిడుగుపాటుకు బెజవాడ రామారావు మృతి చెందాడు. గ్రామ సమీపంలో పశువులను మేత కోసం తీసుకువెళ్లిన రామారావు వర్షం కురుస్తున్న సమయంలో చెట్టు కింద ఉన్నాడు. అకస్మాత్తుగా పిడుగు పడటంతో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అతనితోపాటు ఉన్న మరో ఇద్దరూ అపస్మార్క స్థితిలోకి వెళ్లడంతో వారిని 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
previous post

