Tv424x7
Telangana

వృత్తి విద్యా కాలేజీలు రేపటి నుండి బంద్‌ హెచ్చరిక.

హైదరాబాద్, సెప్టెంబర్ 14:
తెలంగాణలోని ప్రైవేట్ ప్రొఫెషనల్, డిగ్రీ, పీజీ కళాశాలలు సెప్టెంబర్ 15 నుండి నిరవధికంగా బంద్‌ అవుతాయని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ తెలిపింది. ఫెడరేషన్ నేతల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్, MBA, MCA, ఫార్మా, నర్సింగ్ కళాశాలలు ఈ బంద్‌లో పాల్గొంటాయి.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, విద్యా మంత్రి శ్రీధర్ బాబుతో నిన్న జరిగిన చర్చలు ఫలితం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఆదివారం మరోసారి సమావేశం జరగనుంది. చర్చలు విఫలమైతే రేపటి నుంచి వృత్తి, డిగ్రీ, పీజీ కళాశాలల సమ్మె ప్రారంభం అవుతుంది.

కాలేజీల యాజమాన్యాలు గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌గా ఉన్న రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ప్రభుత్వం రూ.1,200 కోట్ల టోకెన్లను జారీ చేసినప్పటికీ, చెల్లింపులు పూర్తిగా అందలేదు అని వారు ఆరోపించారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశమై సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

Related posts

సీఎం సమీక్షలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే

TV4-24X7 News

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్జిస్ సంజీవ్ ఖన్నా?

TV4-24X7 News

నిజాయతీ చాటుకున్న ఆటోడ్రైవర్‌…. ఎం చేసాడో తెలుసా

TV4-24X7 News

Leave a Comment