Tv424x7
Andhrapradesh

వైపాలెం గోశాల రోడ్ పరిస్థితులు ప్రజల వాపసు!!

యర్రగొండపాలెం, మార్కాపురం: వైపాలెం గోశాల రోడ్డులో నివసిస్తున్న 100 కుటుంబాలు తీవ్ర సమస్యలకు గురవుతున్నాయి. రహదారి పూర్తిగా బురదతో నిండిపోవడం వల్ల భక్తులు, స్కూల్ పిల్లలు, కాలనీవాసులు నడవడంలో, ఆడుకోవడంలో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు.

ప్రాంతంలోని గోశాలలలో వేలాది హిందువులు రోజూ గోమాత దర్శనానికి వస్తారు. అయితే రహదారి పరిస్థితుల కారణంగా భక్తులు మరియు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు గుర్తించినట్లుగా, అర్ధరాత్రి ట్రాక్టర్లు అక్రమంగా మట్టి తోలకాలు చేస్తూ, పెద్ద స్పీకర్ల ద్వారా శబ్దం కలిగించడం వల్ల ప్రజలు నిద్రపోలేకపోతున్నారు.

ప్రజలు తెలిపారు, “ఎక్కడికీ ఫిర్యాదు చేసినా, పైస్థాయి అధికారులు మాకు అండ చూపడం లేదని, ఎలాంటి చర్యలు తీసుకోలేమని సమాధానాలు ఇచ్చారు. వీధి లైట్లు ఒక సంవత్సరం పనిచేయడం లేదు. ఇక్కడ విష సర్పాలు తిరుగుతున్నాయి.”

స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు, సిమెంట్ రోడ్ నిర్మాణం, వీధి లైట్లు పునరుద్ధరణ, భద్రతా చర్యలు చేపట్టాలన్నవి. ప్రజలు తమ పిల్లల భద్రత, ఆచరణీయమైన రహదారి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆవేదనతో వాపోతున్నారు.

Related posts

వన్ టౌన్ సీఐ జీడీ బాబు ని హృదయపూర్వకంగా కలిసిన 36 వ వార్డు అధ్యక్షులు

TV4-24X7 News

విషాదం.. పిడుగుపాటుతో ముగ్గురు మృతి..

TV4-24X7 News

యూరియా కొరతపై జగన్ మండిపాటు – చంద్రబాబు పాలనపై సంచలన వ్యాఖ్యలు

TV4-24X7 News

Leave a Comment