Tv424x7
Telangana

చరిత్రలో సువర్ణాక్షరాలు – 783 యువతకు గ్రూప్–2 నియామక పత్రాలు అందజేత

హైదరాబాద్ శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ 783 అభ్యర్థులకు గ్రూప్–2 నియామక పత్రాలు అందజేశారు.

ఒకే రోజు ఇంత మంది యువతకు ఉద్యోగం దక్కించడం, వారి ఆశలను నిజం చేయడం, తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే ఘట్టంగా నిలిచింది.ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎవరు ఖాళీగా ఉండకూడదు. ప్రతి బిడ్డ చదువుకొని ఎదగాలి, ప్రతి యువకుడు ఉద్యోగం పొందాలి” అన్నారు.

ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం తెలిపారు.

గత పదేళ్లలో యువత ఎదుర్కొన్న నిరీక్షణల కాలం ముగిసినట్లు, ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టిందని అధికారులు పేర్కొన్నారు.

Related posts

హనుమకొండలో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డీసీఏ దాడి

TV4-24X7 News

వడదెబ్బకు 8 మంది మృతి.. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TV4-24X7 News

ఇందిరమ్మ ఇల్లు ఫైల్ ప్రాసెసింగ్ కోసం లంచం డిమాండ్ – పంచాయతీ కార్యదర్శి ఏసీబీ చేతికి

TV4-24X7 News

Leave a Comment