నంద్యాల చిన్నచెరువు దగ్గర జరిగిన ఘటన…
108 కు ఫోన్ చేసిన స్పందించిన వైనం.
నంద్యాల అక్టోబర్ 20 నంద్యాల జిల్లా చిన్న చెరువు దగ్గర సుగాలి మెట్ట సమీపంలో ఆదివారం రాత్రి ఎదురు ఎదురుగ రెండు బైకులు డీ కొన్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు . ఈ సంఘటన జరిగిన సందర్భంలో ఒకరు ప్రాణాపాయ స్థితిలో రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ఆ సమయంలో ప్రమాద సంఘటనానికి సంబంధించి ఆ రహదారిలో వెళ్లే ఒకరిద్దరు 108 కు సమాచారం తెలియజేసిన సకాలంలో స్పందించలేదని విశ్వసనీయ సమాచారం. ఆ రహదారిలో వెళ్లే ఆటో వారు కూడా ఆపకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన హుస్సేన్ బాషా, మరియు బుక్కపురానికి చెందిన మల్లేష్ మృతి చెందారు. సువర్ణమ్మా గాయలపలైంది. వివరాలు పూర్తిగా తెలియాల్సింది.

