కడప జిల్లా ప్రొద్దుటూరు :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, నేతలు పార్టీలో చేరారు. ప్రొద్దుటూరుకు శుక్రవారం ప్రజాగళం సభకు చంద్రబాబు రాగా…హెలీప్యాడ్ వద్ద టీడీపీలో చేరారు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, కొత్తపల్లె సర్పంచ్ కోనేరెడ్డి శివచంద్రారెడ్డి, మునిసిపల్ కౌన్సిలర్లు వైయస్ మహమ్మద్ గౌస్, వంగనూరు మురళీధర్ రెడ్డి, అమృతానగర్ ఎంపీటీసీ సౌభాగ్యమ్మ, ప్రొద్దుటూరు వైసీపీ అధ్యక్షుడు కామిశెట్టి సుబ్రహ్మణ్యం, టంగుటూరు మాజీ సర్పంచ్ బాషా, తప్పెట ఓబాయపల్లికి చెందిన లింగారెడ్డి రాజారెడ్డి, లింగారెడ్డి నాగేశ్వర్ రెడ్డి, శెట్టిపల్లె నారాయణరెడ్డి, నక్కలదిన్నెకు చెందిన శెట్టి పల్లె నాగేశ్వర్ రెడ్డి, శెట్టిపల్లె సిద్ధారెడ్డి, పెద్ద గులువలూరుకు చెందిన పాలగి0ఆదినారాయణ రెడ్డి, తదితరులు పార్టీలో చేరారు.
previous post

