అయోధ్యలో అద్భుతం.. 17న రామయ్యకు ‘సూర్య తిలకం’అయోధ్యలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. బాలరాముడు కొలువుదీరిన తర్వాత తొలిసారి ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటలకు రాముడి నుదుటిపై 75MM వ్యాసార్థంతో సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. దాదాపు 6 నిమిషాలపాటు ఈ అపురూప దృశ్యం భక్తులకు కనువిందు చేయనుంది. ఏటా నవమి రోజున ఇలా జరిగేలా ఆలయాన్ని నిర్మించారు.
