విశాఖపట్నం శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు కాశి, అయోధ్య , త్రివేణి సంగమం మొదలైన పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చిన సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.సి .ఎం .ఎ . జహీర్ అహ్మద్, యువ నాయకులు ద్రోణం రాజు శ్రీనివాస్ హాజరయ్యి, నారాయణ సేవలో పాల్గొన్నారు. కాశీ ప్రసాదాన్ని కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సభ్యులు పైడిరాజు, దానయ్య, అప్పలకొండ,యూ . ఎల్లాజీ, మరియు టీ . కృష్ణ పాల్గొన్నారు.
