నంద్యాల పట్టణ శివారులో గల ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల నందు అత్యధికముగా మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు మరియు JEE మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ లో అత్యధిక మార్కులు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఎంతో కృషి పట్టుదలతో అత్యధిక అత్యధికముగా మెడికల్ సీట్లు మరియు ఇంజనీరింగ్ సెట్లు మెడికల్ జేఈఈ మెయిన్స్ సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇంతటి విజయానికి కృషిచేసిన కళాశాల యజమానిన్యము చైర్మన్ శనివారపు కొండారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది . అలాగే భవిష్యత్తులో మరెన్నో మెడికల్ షీట్లు జేఈ మెయిన్స్ / అడ్వాన్స్డ్ సీట్లు సాధించి నంద్యాలకే దేశస్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకురావలసిందిగా విద్యార్థి విద్యార్థులను కోరడం జరిగింది . అలాగే కేక్ కట్ చేసి విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది . అనంతరం కాలేజీ యాజమును ఫరూక్ ని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది . ఈ కార్యక్రమములో ఎస్.వి.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఎస్ వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
