Tv424x7
Andhrapradesh

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకే

విశాఖపట్నం మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరూ వాహనదారులకు న్యాయమూర్తి 15 రోజులు సాధారణ జైలు శిక్షను విధించినట్టు విశాఖ హార్బర్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ అదనపు ఎస్ఐ పక్కి గణేష్ బాబు బుధవారం ఒక ప్రకటనలోని పేర్కొన్నారు. మరో 16 మందికి రూ. 10000 చొప్పున జరిమానా విధించారని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హార్బర్ సబ్ డివిజన్ ట్రాఫిక్ సీఐ ఎస్.షణ్ముఖరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను వాహన దారులందరూ పాటించే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్ఐ పక్కి గణేష్ బాబు హెచ్చరించారు.

Related posts

అమరావతిలో భూ కేటాయింపులపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ..

TV4-24X7 News

శివశంకర్ కు చైర్మన్ పదవి పట్ల కందుల హర్షం

TV4-24X7 News

గత రెండు నెలల నుంచి ధాన్యం డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులు

TV4-24X7 News

Leave a Comment