Tv424x7
Andhrapradesh

రోడ్డుపై ఆక్రమణలు తొలగించి గుంతలు పూడ్చిన పోలీసులు రోడ్డు ప్రక్క వ్యాపారులు ట్రాఫిక్ సమస్యపై సహకరించాలి సిఐ రేవతమ్మ

విశాఖపట్నం నర్సీపట్నం సిఐ గా ఎల్. రేవతమ్మ బాధ్యతలు చేపట్టిన నాటినుండి రోడ్లపై ఆక్రమణదారుల భరతం పడుతున్నారు గతవారం మెయిన్ రోడ్డు ఆక్రమణలపై దృష్టి పెట్టి మున్సిపల్ అధికారుల సహాయంతో రోడ్లపై ఆక్రమణలను తొలగించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. తాజాగా బుధవారం కనకదుర్గ గుడి నుండి పోస్ట్ ఆఫీస్ వరకు బైపాస్ రోడ్డులో రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణలను మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, సహకారంతో తొలగించారు. ఆక్రమణలను తొలగించడమే కాక, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఎంతోకాలంగా గుంతల రోడ్డుతో ఇబ్బందుపడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రోడ్డుపై గుంతలను మున్సిపాలిటీ జెసిబితో కప్పించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దగల రోడ్డులో గోతులవల్ల అనేక ఇబ్బందులు పడ్డామని, ఎన్నోసార్లు ఈ ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ఇంత కాలానికి సమస్యను పరిష్కరించిన సీఐ రేవతమ్మకు, మున్సిపల్ కమిషనర్ సురేంద్రకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ జె రమేష్, మునిసిపల్ సిబ్బంది, పట్టణ పోలీసులు పాల్గొన్నారు.

Related posts

పోలేరమ్మ దేవస్థానం పనులలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి: సీ.పి.యం పార్టీ మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్

TV4-24X7 News

శ్రీ శ్రీ యోగి నాగేంద్ర స్వామి ఆలయంలో ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకున్న వివేకానంద ఆశ్రమ వాసులు

TV4-24X7 News

రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకు మద్దతుగా కొన్ని చర్యలు చేపట్టింది…

TV4-24X7 News

Leave a Comment