Tv424x7
Andhrapradesh

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త..

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారికి ఉచితంగానే సామూహిక సేవలు

ధర్మ ప్రచారంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు గల సామాన్య భక్తులకు నెలకు ఒక రోజు ఉచిత సామూహిక సేవలు జరిపించుకునే అవకాశం శ్రీశైలం దేవస్థానం కల్పిస్తున్నది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన భక్తుల సౌకర్యార్థం ఈ వసతి కల్పించింది. ప్రతి నెలా ఒక రోజున జరిగే ఈ సేవలో 250 మంది భక్తులు పాల్గొన వచ్చు. అయితే, ఈ సామూహిక సేవలో పాల్గొనాలని భావించే భక్తులు ముందస్తుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.శ్రీశైలంలో ఉచిత సామూహిక సేవలో పాల్గొనాలి అనుకునేవారు.. www.srishailadevastanam.org వెబ్‌సైట్‌లో ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలో దంపతులు లేదా ఒక్కరు పాల్గొనే అవకాశం ఉంటుంది.. ఈ సేవలను యూట్యూబ్‌లో ఆలయానికి సంబంధించిన శ్రీశైల టీవీ ద్వారా భక్తులు వీక్షించొచ్చని తెలిపారు.అంతేకాదు శ్రీశైలం ఆలయంలో ఈ ఉచిత సామూహిక సేవలను ఆయా మాసాలకు ఉన్న విశిష్టత ప్రకారం నిర్వహిస్తారని తెలిపారు. ఈ సేవలు 2024 ఫిబ్రవరి 16 వరకు ప్రతి నెలలో ఒక రోజును ఎంపిక చేస్తారు.. ఈ ఉచిత టికెట్ ప్రతి మాసంలో 250మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. భక్తులకు కచ్చితంగా తెల్లరేషన్‌కార్డు ఉండాల్సిందే. అర్హత ఉన్న భక్తులు తెల్లరేషన్‌ కార్డును స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.అభిషేకం తర్వాత భక్తులు స్పెషల్ క్యూ లైన్‌లో స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనంతో పాటూ వృద్ధ మల్లికార్జునస్వామి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ సేవలో పాల్గొన్నవారికి రెండు లడ్డూ ప్రసాదాలు, విభూది, కైలాస కంకణాలు, కుంకుమ, శ్రీశైల ప్రభ, రవిక వస్త్రం, కాటన్‌ కండువాలను అందజేస్తారు. స్వామివారి దర్శనం అనంతరం దేవస్థానం అన్నపూర్ణ భవన్‌లో భోజన సదుపాయం కూడా ఏర్పాటుచేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆలయ అధికారులు సూచించారు .

Related posts

కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా సెలవులు అడగొద్దు

TV4-24X7 News

జనసేనాలోకి పాశం ఎస్టేట్ బ్రదర్స్

TV4-24X7 News

ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు: అచ్చెన్నాయుడు

TV4-24X7 News

Leave a Comment