విశాఖపట్నం జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50% రాయితీ కల్పిస్తూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఏపీజెయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లి శ్రీనివాసులు నాయుడు హర్షం వ్యక్తం చేసారు. మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిత్యం పని ఒత్తిడితో పనిచేసే జర్నలిస్టులకు తాను అండగా నిలుస్తానని తెలిపారు. సమాజంలో ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలకు చేదోడుగా నిలిచి, తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు తాను అందుబాటులో ఉంటానని శ్రీనివాసులు నాయుడు ప్రకటనలో తెలిపారు.

previous post