Tv424x7
Andhrapradesh

మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేశ్ రెడ్డి అరెస్ట్

రాయచోటి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు రాయచోటి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ రెడ్డప్పగారి రమేశ్ రెడ్డిని లక్కిరెడ్డిపల్లె పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు రావడంతో, లక్కిరెడ్డిపల్లెలోని మంత్రి అనుచరులు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో, పోలీసులు శ్రీ రమేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం మదనపల్లె పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో లక్కిరెడ్డిపల్లెలోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించబడతాయి.

Related posts

వన్ టౌన్ సీఐ జీడీ బాబు ని హృదయపూర్వకంగా కలిసిన 36 వ వార్డు అధ్యక్షులు

TV4-24X7 News

రేపు విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటన….

TV4-24X7 News

రాయవరం రమణమ్మ మృతి కి రెడ్యo సోదరుల సంతాపం

TV4-24X7 News

Leave a Comment