Tv424x7
Andhrapradesh

కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్​!

తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాల్సిందే!!

కొత్త రేషన్​కార్డుదారలు ఈ-కేవైసీ చేసుకోవాలంటున్న అధికారులు.

సమీపంలో రేషన్​షాప్​నకు వెళ్లి వేలిముద్రలు అప్​డేట్​ చేసుకోవాలని సూచన.

బినామీలకు చెక్​ పెట్టేందుకే ఈకేవైసీ నిబంధన.

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్​ కార్డులను జారీ చేసిన సంగతి తెలిసిందే.

కార్డులు పొందిన వారు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

కొత్త రేషన్​ కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులందరు సమీపంలోని రేషన్‌ దుకాణానికి వెళ్లి ఈ-పాస్‌ యంత్రంలో బయోమెట్రిక్‌ వేలిముద్రలను (ఫింగర్​ ప్రింట్​లను) అప్‌డేట్‌ చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ప్రతి ఒక్కరు ఈ-కేవైసీ నమోదు చేయించుకోవాలని గత రెండేళ్ల నుంచి సర్కారు పలుమార్లు పేర్కొంది

గడువు పెంచుకుంటూ వెళ్తోంది.

కామారెడ్డి జిల్లాలో 26,521 కొత్త రేషన్‌కార్డులు మంజూరయ్యాయి.

వారికి సెప్టెంబరు నెలలో కోటా బియ్యం కూడా విడుదల చేశారు.

40 వేల మంది కుటుంబ సభ్యులకు సంబంధించి పేర్లను పాత కార్డుల్లో జమ చేశారు వీరు కూడా ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.

అందుకే కేవైసీ నిబంధన.

జిల్లాలో ప్రస్తుతం 2,83,253 రేషన్‌కార్డులు ఉండగా అందులో 86 శాతం మంది ఈ-కేవైసీ చేయించుకున్నారు.

మిగతా కార్డుదారులు త్వరగా చేయించుకోవాల్సి ఉంటుంది.

ఈ-కేవైసీ చేయించుకోని వారికి బియ్యం బంద్‌ చేస్తామని కేంద్రం గతంలో పేర్కొంది.

ఎందుకంటే ఆధార్‌కు ఈ-పాస్‌ యంత్రానికి అనుసంధానం చేయడం వల్ల బినామీలు బియ్యం తీసుకోవడానికి వీలుండదు. అందుకే కేవైసీ నిబంధన విధించారు.

నవీకరణ లేకపోవడంతో ఆలస్యం.

ఆధార్‌ అప్‌డేట్‌ లేకపోవడం వల్ల కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వీరు ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి అప్​డేషన్​ ప్రక్రియను పూర్తి చేయించుకున్నప్పటికీ ఈ-కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు.

ఇదేంటని ఇతర ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి తెలుసుకుంటే ఆధార్‌ నవీకరణ పూర్తి కాకపోవడం వల్ల ఈ-కేవైసీ తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు.

దీంతో లబ్ధిదారులు వేర్వేరు ఆధార్‌ సర్వీస్​ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు.

ఆధార్‌ నవీకరణ పూర్తికాకపోవడం వల్ల చిన్నారులు ఈ-కేవైసీకి దూరమవుతున్నారు.

ఆధార్‌ కేంద్రాలు తక్కువ.

కామారెడ్డి జిల్లాలో ఆధార్‌ కేంద్రాలు తక్కువ ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో ఆధార్‌ సెంటర్లు లేని మండలాల ప్రజలు ఇతర మండలాలకు వెళుతున్నారు.

అధికారులు స్పందించి కనీసం మండలానికి ఒక ఆధార్‌ కేంద్రాన్ని అయినా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు.

గడిచిన ఏడాదిగా జిల్లాలో ఐదారు ఆధార్‌ కేంద్రాల సర్వీసులను నిలిపివేశారు.

జిల్లాలో 25 మండలాలు ఉండగా 10 ఆధార్‌ సెంటర్లు మాత్రమే కొనసాగుతున్నాయి.

మిగతా మండలాల్లో మాత్రం ఆధార్‌ కేంద్రాలు లేవు.

ఈ విషయమై డీఎస్‌వో మల్లికార్జున్‌బాబు మాట్లాడుతూ.. కొత్తకార్డుదారులు ఈ-కేవైసీ చేయించుకుంటే వారికే మంచిదని వివరించారు.

రేషన్ కేంద్రాల్లో చాలా మందికి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తికావడం లేదు.

దీనికి రేషన్​కార్డుదారులు ఆధార్ నవీనీకరణ (అప్​డేట్)​ చేసుకోకపోవడమే కారణమని డీలర్లు చెబుతున్నారు

దీంతో ప్రజలు ఆధార్ కేంద్రాలకు అప్​డేట్​ కోసం పరుగులు తీస్తున్నారు.

అయితే ఆధార్ కేంద్రాలు తగినన్ని లేకపోవడం వల్ల ఉన్న కొద్దిపాటి కేంద్రాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు.

చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఇటు రేషన్ కేంద్రాల చుట్టూ అటు ఆధార్ కేంద్రాల చుట్టూ అప్​డేట్​ కోసం​ తిరుగుతున్నారు.

Related posts

CM జగన్ కాన్వాయ్పై రాయితో దాడి

TV4-24X7 News

RMP వైద్యులపై చర్యలు తీసుకోవాలి

TV4-24X7 News

ప్రతి ఆహార వ్యాపారి పోస్టాక్ శిక్షణా సర్టిఫికేషన్ పొంది ఉండాలి : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హరిత రాయల్

TV4-24X7 News

Leave a Comment