Tv424x7
Andhrapradesh

అడవిలో మృతదేహాల కేసు.. పోలీసులకు సవాల్‌గా మారిన మిస్టరి!!

తిరుపతి జిల్లా పాకాల మండలం మూలకోన అటవీ ప్రాంతంలో బయటపడిన నాలుగు మృతదేహాల కేసు మిస్టరీగా మారింది. ఇప్పటికే నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినా, అవి హత్యలనా? లేక ఆత్మహత్యలనా? అన్నది తేల్చలేని పరిస్థితి నెలకొంది.

మృతుల్లో సెల్వన్, జయమాలిని అన్నాచెల్లెలుగా గుర్తించారు. వీరిద్దరూ కోటి రూపాయలకు పైగా ఫైనాన్స్ వ్యాపారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలుసుకున్నారు. ఆశించిన స్థాయిలో రికవరీలు లేకపోవడంతో, మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే మిగతా ఇద్దరి గుర్తింపు, మరణాల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఒకేసారి నలుగురు అడవిలో మృతి చెందడం వెనుక ఏదో పెద్ద రహస్యముందని పోలీసులు భావిస్తున్నారు.

అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, ఫోన్ రికార్డులు, వ్యక్తిగత సంబంధాలపై వివరాలు సేకరిస్తున్నారు.

👉 ఈ కేసు వెనుక ఉన్న నిజాలు ఏంటో వెలుగులోకి రావాల్సి ఉంది. అప్పటివరకు ఇది పోలీసులకు పెద్ద సవాల్‌గానే మారింది.

Related posts

నేషనల్ హెరాల్డ్ కేసుపై వైఎస్ షర్మిల రియాక్షన్

TV4-24X7 News

జగన్నాసుర రక్తచరిత్రపై ఛార్జ్ షిట్ విడుదల చేసిన వరదరాజులరెడ్డి

TV4-24X7 News

ఏపీలో ఐదు నెలల్లో కూటమి కుప్పకూలడం ఖాయం: తులసిరెడ్డి

TV4-24X7 News

Leave a Comment