చిత్తూరు: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తన సొంత నిధులతో నగరంలోని 40, 41 వార్డుల రజక వృత్తిదారులకు 25 ఉచిత ఇస్త్రీ బండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వస్త్రాన్ని ఇస్త్రీ చేసి వారిని ఆశ్చర్యపరచడంతో, రజక వృత్తిదారులపై ఆయన గౌరవం స్పష్టమైంది.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ ఆముద్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఉమ్మడి పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, రజకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

