జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని దేశమంతా ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో, అదే రోజు మన దేశం మరచిపోకూడని మరో మహానేత లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా కావడం విశేషం.
చిన్నకాయుడైనా మహానాయకుడిగా నిలిచిన శాస్త్రిగారు, 1965 భారత్–పాక్ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఆ సందర్భంలో ఇచ్చిన ఆయన నినాదం “జై జవాన్ – జై కిసాన్” నేటికీ ప్రజల మనసుల్లో మార్మోగుతూనే ఉంది.
1966లో తాష్కెంట్ ఒప్పందం తర్వాత ఆయన అకస్మాత్తుగా మరణించడం దేశానికి పెద్ద దెబ్బ. తక్కువ కాలం ప్రధానిగా పనిచేసినా, ఆయన నీతి, నిరాడంబరత, త్యాగం, దృఢ సంకల్పం ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టాయి.🕊️ ఓ శాస్త్రీ! సరిలేరు నీ కెవ్వరూ!

