Tv424x7
Political

బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై బురఖా డిబేట్: బీజేపీ–ఆర్జేడీ విభేదం

బీహార్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు దిలిప్ జైస్వాల్ తెలిపారు, పోలింగ్ బూత్‌లకు బురఖా ధరించి వచ్చే మహిళల గుర్తింపును సరిచూసే విధంగా చర్యలు తీసుకోవాలని. బురఖా ధరించిన ఓటర్ల ఫోటో ఐడీలను పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించాలి అని విజ్ఞప్తిలో సూచించారు.

దీనిపై ఆర్జేడీ నేత అభయ్ కుశ్వాహా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ రాజకీయ కుట్రకు పాల్పడుతోందని, ఇప్పటికే రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) జరిగిందని, కొత్తగా ముస్లిం మహిళల గుర్తింపును వెరిఫై చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఇంకా, బీజేపీ ప్రతిపాదన ప్రకారం ఎన్నికలు రెండు దశల్లోనే ముగించాలి, దీని‌పై ఆర్జేడీ, ఇతర పార్టీలు కూడా సమ్మతి తెలిపారు. ఒకే రెండు నెలల్లో, ఛాట్ పండుగ తర్వాతే ఎన్నికలు జరగాలని అభయ్ కుశ్వాహా సూచించారు.

Related posts

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

TV4-24X7 News

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ప్రమాణాల వివాదం

TV4-24X7 News

అసెంబ్లీకి ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు…

TV4-24X7 News

Leave a Comment