తుఫానుపై కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు సాయం, 25 కేజీల బియ్యం సహా నిత్యావసరాల పంపిణీ చేయాలని ఆదేశించారు.
ప్రతి పునరావాస కేంద్రంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కాలువ గట్లు తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు బయటకు రాకుండా స్థానిక అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
“ప్రజల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకూడదు… అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి” – సీఎం చంద్రబాబు

