TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో ఆయన కాంగ్రెస్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఈసీ చర్యలు చేపట్టింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.

