Tv424x7
Andhrapradesh

ఉచితంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్ కార్డులు

అప్ గ్రేడ్ చేసుకోవాల్సిందిగా కస్టమర్లకు సంస్థ సూచన

రాష్ట్రంలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో మెరుగైన టెలికాం సర్వీసుల కోసం తమ సిమ్ లను 4జీ టెక్నాలజీకి అప్ గ్రేడ్ చేసుకోవాల్సిందిగా సంస్థ సూచించింది.

ప్రస్తుతం 2జీ/3జీ సిమ్ లు వినియోగిస్తున్నవారికి 4జీ సిమ్ లను ఉచితంగా అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీసులు

బీఎస్ఎన్ఎల్ సర్వీసు సెంటర్లతో పాటు బీఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీలు/రిటైలర్లు/ఏజెంట్ల వద్ద 4జీ సిమ్ లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

ప్రస్తుతం వినియోగిస్తున్న సిమ్ ఏ టెక్నాలజీ అన్నది. 54040 అనే నెంబర్ కు ” S అని సందేశం పంపడం ద్వారా అది 2జీ/3జీ/4జీ సిమ్మా అనే విషయాన్ని తెలుసుకోవచ్చని పేర్కొంది.

4జీ సేవలు అందుబాటులోకి వచ్చిన చోట్ల 2జీ/3జీ సిమ్ వినియోగిస్తున్న వారి సేవలకు అంతరాయం ఏర్పడుతోందని, ఈ ఇబ్బందిని తొలగించడానికి ఉచితంగా 4జీ సిమ్ లను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ పీజీఎం వై.రవీంద్రనాథ్ తెలిపారు.

బిఎస్ఎన్ఎల్ మైదుకూరు ఆఫీసు: అన్న క్యాంటీన్ పక్కన ప్రొద్దుటూరు రోడ్ 9491431109

Related posts

కోరిక తీర్చాలని బెదిరించాడు.. ఎమ్మెల్యే ఆదిమూలంపై చంద్రబాబుకు బాధితురాలి లేఖ

TV4-24X7 News

కడపలో ఏ నియోజకవర్గానికి ఎన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు

TV4-24X7 News

జీవీఎంసీ కమిషనర్ ని కలిసిన జనసేన పార్టీ శ్రేణులు

TV4-24X7 News

Leave a Comment