విశాఖపట్నం నర్సీపట్నం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, నమ్మకం అయిన సమాచారము తో, నర్సీపట్నం రూరల్ సర్కిల్ సీఐ ఎల్ .రేవతమ్మా ఆధ్వర్యంలో, నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఎస్సై పి.రాజారావు మరియు సిబ్బంది ఈరోజు నర్సీపట్నం మండలం ధర్మాసాగరం గ్రామ శివారులో నాటు సారా తయారీకి సంబంధించిన స్థావరాలపై నమ్మకమైన సమాచారంతో, నర్సీపట్నం రూరల్సర్కిల్ సీఐ , ఎస్ ఐ , సిబ్బంది తో మెరుపు దాడి చేయగా నాటు సారా తయారీకి ఉపయోగించే పులుపు సుమారు 6000 లీటర్ల ను ధ్వంసం చేయడం జరిగినది అదేవిధంగా నాటు సార తయారీకి ఉపయోగించే సామగ్రిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ఎక్కడైనా నాటుసార తయారీ గాని అమ్మకాలుగాని అక్రమంగా మద్యం అమ్మకాలు జరిగినట్లుగా అయితే పోలీస్ వారికి సమాచారం ను , సీఐ ఎన్ ఆర్ పీఎం రూరల్ సర్కిల్ 9490619497, ఎస్ ఐ – ఎన్ ఆర్ పీఎం రూరల్ పి ఎస్ 9490619496 ఫోన్ నంబర్స్ కాల్ చేయడం ద్వారా తెలపవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరు అయిన, నాటు సార తయారీ చేసిన, అమ్మిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
previous post
next post

