మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. కేసులకు బయపడితే రాజకీయం చేయాలేమంటూ పేర్కొన్నారు. వైపీసీ ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన ఓడిపోయిందని, మోసం చేసిన కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎద్దేవా చేశారు. తప్పకుండా అధికారంలోకి వస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.
