Tv424x7
Andhrapradesh

విజయవాడ టూ తిరుపతి.. ఇకపై నాలుగున్నర గంటలే..

విజయవాడ టూ తిరుపతి.. ఇకపై నాలుగున్నర గంటలే.. రయ్..రయ్‌మని దూసుకెళ్లొచ్చుఈ వందేభారత్ ట్రైన్ మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు నడవనుంది. ట్రైన్ నెంబర్ 20711తో విజయవాడలో ఇది ఉదయం 5.15 గంటలకు బయల్దేరి.. ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 20712 నెంబర్‌తో బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు స్టార్ట్ అయి.. విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుందితెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం స్టాప్‌లు కాగా.. విజయవాడ(ఉదయం 5.15) నుంచి తిరుపతి(ఉదయం 9.45)కి కేవలం నాలుగున్నర గంటలు మాత్రమే ప్రయాణం ఉండనుంది. ఇప్పటివరకు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లేవారికి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, మూడు రోజులు మాత్రమే నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ వందేభారత్ రైలు వస్తే.. ఇకపై ఆ ప్రయాణీకుల కష్టాలు తీరనున్నట్టే.

Related posts

ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ బిల్ గేట్స్ లేఖ

TV4-24X7 News

శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతుల ఆగ్రహం

TV4-24X7 News

ఆంధ్ర పోటీలను ప్రారంభించిన….. ఎమ్మెల్యే మేడా.

TV4-24X7 News

Leave a Comment