Tv424x7
Andhrapradesh

నాగుల గుట్ట పల్లి లో పోలీసుల పల్లెనిద్ర

నాగుల గుట్ట పల్లి లో పోలీసుల పల్లెనిద్ర

ప్రజలతో పోలీసులు స్నేహంగా మెలిగేందుకు పల్లెనిద్ర దోహదం- ఆర్కే సీఐ గోవింద రెడ్డి

చక్రాయపేట మండలంలోని సురభి నాగుల గుట్ట పల్లి లో శనివారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌసల్ ఆదేశాల మేరకు ఆర్కే వ్యాలీ సి ఐ గోవింద రెడ్డి పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, ప్రజా సమస్యల్ని తెలుసుకున్నారు. ప్రజలతో పోలీసులు స్నేహంగా మెలిగేందుకు పల్లెనిద్ర దోహదపడుతుందని తెలిపారు. అలాగే గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల కర్తవ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో , సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

విల్లూరి భాస్కర రావు ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతి

TV4-24X7 News

ఏపీలో సీపెట్ కు దరఖాస్తుల స్వీకరణ

TV4-24X7 News

గోవధకు ఎక్కడా అనుమతి లేదు – లులూ షరతులపై పవన్‌ కఠిన వ్యాఖ్య

TV4-24X7 News

Leave a Comment