Tv424x7
Andhrapradesh

పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలరెడ్డి ఫోన్ టాపింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి..ll

ప్రొద్దుటూరు, జూన్.17: తెలంగాణ రాష్ట్రం ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తులో మరో కొత్త మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్, పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఫోన్ నెంబర్ టాపింగ్ అయినట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ళ క్రితం 2021 లో ఫోన్ నెంబర్ టాపింగ్ అయినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా, పొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష మాట్లాడుతూ.. పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఫోన్ నెంబర్ టాపింగ్ చేయడం దుర్మార్గపు చర్య అని ఆయన ఖండించారు. ఫోన్ నెంబర్ టాపింగ్ చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు.

Related posts

చెవిరెడ్డి అరెస్ట్ పై ఆయన భార్య లక్ష్మి స్పందన….

TV4-24X7 News

అకౌంట్లలోకి ‘చేయూత’ స్కీమ్ డబ్బులు విడుదల

TV4-24X7 News

ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వ్యక్తికి వాసుపల్లి రూ. 5 వేలు సాయం

TV4-24X7 News

Leave a Comment