Tv424x7
Andhrapradesh

బనగానపల్లె మండల పరిషత్ సర్వసభ్య సమావేశం – అభివృద్ధి, సంక్షేమం పై చర్చ!!

బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు సమావేశంలో పాల్గొని, మండలంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ చేశారు. సమావేశానికి బీసీ జానార్ధన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

సమావేశంలో ముఖ్యంగా రైతుల సమస్యలు, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్, ప్రభుత్వ ఆసుపత్రుల లోకేషన్లు, RTC బస్టాండ్ సమస్యలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే బీసీ జానార్ధన్ రెడ్డి అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలను దృష్టిలో ఉంచి వివిధ ఆదేశాలు జారీ చేశారు.

రైతుల సమస్యలు: అన్ని మండలాల్లో ఎరువులు సమయానికి పంపిణీ చేయాలని, వ్యవసాయాధికారులు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ఎటువంటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.

పాఠశాలలు: ప్రభుత్వ పాఠశాలల్లో చిన్న మరమ్మతులు, అవసరమైతే దాతల సహకారం ద్వారా నిర్వహించాలని సూచించారు.

సోషల్ వెల్‌ఫేర్ హాస్టల్స్: సమస్యలపై నివేదిక ఇవ్వాలని, స్థానిక అవసరాలను గుర్తించేందుకు హాస్టల్ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రులు: బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రుల్లో గైనిక్, GDA, డెర్మటాలజిస్ట్, స్టాఫ్ నర్స్ కొరత ఉందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమని హామీ ఇచ్చారు.

RTC బస్టాండ్: మురుగు కాలువలను ఆక్రమించిన ఫిర్యాదులపై RTC అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అమలులో ఉన్న ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని ప్రధానంగా చూసి, బనగానపల్లె పట్టణంలో 70 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దామని, రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడతగా రూ. 7,000 జమ చేసినట్లు తెలిపారు. అలాగే, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన తల్లులకు నగదు జమ చేసినట్లు సమావేశంలో వివరించారు. గోరుకల్లు రిజర్వాయర్‌లో నీటిని సంపూర్ణంగా నిల్వ చేసినట్టు కూడా పేర్కొన్నారు.

Related posts

_ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక_

TV4-24X7 News

జమ్మూ-కశ్మీర్: కిష్త్వార్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్!!

TV4-24X7 News

గ్రామ సదస్సులో ప్రజలు విన్నవించిన ప్రతిఒక్క సమస్యను పరిష్కరిస్తాం. .!

TV4-24X7 News

Leave a Comment