Tv424x7
Andhrapradesh

తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం!!


తిరుమలలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా గరుడ వాహన సేవ కోసం ప్రత్యేక చర్యలు, భక్తులకు భద్రతా సౌకర్యాలపై సమీక్ష జరగనుంది.

ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 24న ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు స్వయంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రత, తాగునీరు, వసతి, రవాణా వంటి సౌకర్యాల ఏర్పాట్లను సమీక్షించనున్నారు. అదేవిధంగా ఇతర పరిపాలనా అంశాలపై కూడా చర్చించి బోర్డు తీర్మానాలు చేయనుంది.

Related posts

మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగాఓల్టేజ్ హోం లో సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు

TV4-24X7 News

రాజంపేటలో TDP, YCP కార్యకర్తల మధ్య ఘర్షణ

TV4-24X7 News

పనికొస్తారని భావిస్తేనే టికెట్‌ ఇస్తారు’.. వచ్చే ఎన్నికల్లో పోటీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.

TV4-24X7 News

Leave a Comment