తిరుమలలో అలిపిరి ప్రాంతంలో మలమూత్ర విసర్జన స్థలాల మధ్య, మద్యం బాటిళ్లతో పాటు శ్రీ మహావిష్ణువు విగ్రహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది.
మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దీన్ని “ఘోర అపచారం”గా పేర్కొంటూ మండిపడ్డారు.
ఆయన మాట్లాడుతూ—
👉 “భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, హైందవ ధర్మాన్ని అవమానించేలా వరుస అపచారాలు జరుగుతున్నాయి. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్లక్ష్యం పెరిగింది. ఇది హిందూ సమాజానికి అవమానం” అని అన్నారు.
👉 హిందూ సంఘాలన్నీ కలసి ఈ నిర్లక్ష్య ధోరణిని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.

