విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేత బుధవారం ప్రత్యేక వైద్య శిబిరాలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా “స్వస్థ్ నారీ సశక్త్ కుటుంబ అభియాన్” పేరుతో మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఈ శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.
ఇందోర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు.
🔹 రాష్ట్రవ్యాప్తంగా 14,500 వైద్య శిబిరాలు నిర్వహణ
🔹 8,181 మంది స్పెషలిస్టు వైద్యులు సేవలు అందించనున్నారు
🔹 లక్ష్యం – కోటి మందికి పైగా ఆరోగ్య పరీక్షలు
🔹 నిర్వహణలో 4,000 మంది సిబ్బంది – సచివాలయాలు, అంగన్వాడీలు, ఆరోగ్యశాఖ
🔹 మహిళా-శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, మునిసిపల్, విద్యాశాఖ, IMA, రెడ్క్రాస్ సహకారం
ఈ శిబిరాల్లో మహిళలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహిస్తారు. అలాగే చిన్నారులకు టీకాలు వేయనున్నారు.

