రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు ‘ధహనం’ వెబ్ సిరీస్ నిర్మాతలపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
తన అనుమతి లేకుండా తన వృత్తిగత గుర్తింపును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడారని ఆమె ఆరోపించారు.
అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో తానే వ్యాఖ్యాతగా ఉన్నట్లు తప్పుడు రీతిలో చూపించారని, దాంతో తన పరువుకు తీవ్ర నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అదే విధంగా, సిరీస్లో అభ్యంతరకరమైన కంటెంట్ కారణంగా మానసిక వేధింపులు, అవమానం ఎదుర్కోవలసి వచ్చిందని అంజనా సిన్హా తెలిపారు.ఈ నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

