అమెరికా :
అమెరికాలోని ఒక షాపింగ్ మాల్లో ఇద్దరు భారతీయ విద్యార్థినులు దొంగతనానికి పాల్పడగా రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. షాపులో వస్తువులు ఎంచుకొని బిల్లు చెల్లించకుండా బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించగా, షాపు యజమాని వారిని అడ్డగట్టి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు.. విద్యార్థినులే దొంగతనానికి పాల్పడ్డారని నిర్ధారించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఈ ఘటనతో అక్కడి స్థానిక భారతీయ విద్యార్థుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని, వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించాయి.

