అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్లను ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
త్వరలో 1500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నామని, వీటిని పల్లె వెలుగు బస్సులుగా వినియోగిస్తామని తెలిపారు.
ఇకపై మహిళలు ఏసీ బస్సులలోనూ ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు.
ఆర్టీసీ ఆస్తులను ఎవరికీ ధారాదత్తం చేయడం లేదని, కొత్త డిపోలు సిద్ధం అయ్యే వరకు అటువంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.

