Tv424x7
Andhrapradesh

సామాన్య మానవులు రోజువారి తినే తిండి పైన జిఎస్టి తగ్గలేదు


బియ్యము కంది బేడలు నూనె చక్కెర మిర్చి తదితర నిత్యావసర వస్తువుల పైన జిఎస్టి భారము తగ్గలేదు
నిరంతరము వాడుకునే వస్తువుల పైన కాకుండా ఎప్పుడో ఒకసారి ఉపయోగించే కార్లు ఫ్రిజ్లు టీవీలో మోటార్ సైకిల్ పైన భారం తగ్గించి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వము ప్రచారం చేసుకుంటున్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వము దసరా సందర్భంగా ముందుగానే దసరా దీపావళి చేసుకోవచ్చు అని ప్రకటనలు ఇచ్చినారు కానీ ఇంట్లో వాడుకునే సరుకులకు మాత్రము తగ్గించిన పరిస్థితి లేదు రెండు సార్లు గెలిచినప్పుడు దేశ ప్రధానికం అందరితో అన్ని వస్తువుల పైన జిఎస్టి బారాలు పెంచి దోచుకొని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చారు నేడు చేసింది తక్కువ ప్రచారం ఎక్కువ అని ఆరోపణ చేస్తున్న ప్రజల తరఫున తెలియజేస్తున్న సిపిఎం మాజీ జిల్లా నాయకులు ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్వలి
కేంద్రంలో మంత్రులకు ఎంపీలకు రాజ్యసభ సభ్యులకు అందరికీ వేతనాలు సౌకర్యాలు పెంచినారు కానీ దేశంలో ఉన్న కార్మిక ఉద్యోగులకు వేతనాలు పెంచిన పరిస్థితి లేదు. రెగ్యులర్ చేసిన పరిస్థితి లేదు దసరా కానుక సందర్భంగా దేశంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరూ సమాన పనికి సమాన వేతనము అమలు చేస్తే మేము కూడా రెగ్యులర్ ఉద్యోగస్తుల తో పాటు అన్ని సౌకర్యాలు పొందవచ్చు ఇన్నేళ్లు సర్వీస్ చేసినా మాకు పెన్షన్ లేదు కోట్లు సంపాదించిన కోటీశ్వరులైన ఎంపీలు మంత్రులకు పెన్షన్ సౌకర్యం ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యములు ఆరోగ్య కొరకు నిధులు కేటాయించిన ప్రభుత్వము సామాన్య ప్రజలకు చేయలేదని నేటి దసరా పండుగ సందర్భంగా ప్రజలందరూ అర్ధాకలితో అప్పులతో అప్పులతో జీవనం గడుపుతున్నారు రైతుల పరిస్థితి రైతు కూలీల పరిస్థితి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇదేవిధంగా ఉన్నది కేంద్రంలోని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు పరిష్కరిస్తారని చూద్దాం బీహార్ ఇతర రాష్ట్రాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి ప్రజలకు సౌకర్యం కల్పించడం జరిగిందనేది వాస్తవము మరొకవైపు ప్రజల దగ్గర డబ్బు లేనందువలన మార్కెట్లో సరుకులు నిలబడిపోయి కార్పొరేట్ సంస్థలు నష్టాల్లో ఉన్నందుకు వారికి మేలు చేకూర్చడం కోసం కేంద్రం తీసుకున్న నూతన ఎత్తుగడ అని ఆరోపణ చేస్తున్న సిపిఎం మాజీ జిల్లా నాయకులు ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్వలి నంద్యాల

Related posts

పోసాని కృష్ణమురళిపై ఎస్పీకి ఫిర్యాదు

TV4-24X7 News

అన్నసంతర్పణ కార్యక్రమమునకు ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీతంరాజు సుధాకర్

TV4-24X7 News

సమస్యలపై జీవీఎంసీ కమిషనర్ కి వినతి పత్రం అందజేస్తున్న విల్లూరి

TV4-24X7 News

Leave a Comment