Tv424x7
Andhrapradesh

మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి!**సజ్జనార్, ఆర్టీసీ ఎండీ

! ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది. ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.

Related posts

విద్యాశాఖాధికారిగా నియమితులైన ప్రేమ్ కుమార్ ని కలిసినా అప్పసా కార్యవర్గ సభ్యులు

TV4-24X7 News

అర్ధరాత్రి కేంద్ర బలగాలు అధీనంలోకి నాగార్జున సాగర్

TV4-24X7 News

ఒకే కుటుంబంపై కత్తులతో దాడి

TV4-24X7 News

Leave a Comment