Tv424x7
Telangana

హైదరాబాద్‌ జూలో బెంగాల్ టైగర్ అభిమన్యు మృత్యువాత

హైదరాబాద్‌ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో అరుదైన రాయల్‌ బెంగాల్‌ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం సాయంత్రం మృత్యువాత పడింది. తొమ్మిదేళ్లప్రాయం ఉన్న తెల్లపులి అభిమన్యుకు గతేడాది ఏప్రిల్‌లో ‘నెఫ్రిటీస్‌’ కిడ్నీ సంబంధమైన జబ్బు ఉన్నట్లు జూ అధికారులు గుర్తించారు. ఆరోగ్యపరంగా కొంత బలహీనంగా ఉన్న అభి మన్యుకు అన్ని రకాల వైద్యసేవలు జూ” వెటర్నరీ విభాగం అధికారులు అందించడంతో పాటు వీబీఆర్‌ఐ, వెటర్నరీ అధికారుల సూచనలు తీసుకున్నారు. ఈ నెల 12న అభిమన్యు ఆహారం తీసుకోలేదు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో మంగళవారం మృత్యువాత పడింది. పోస్టుమార్టం నివేదికలో మూత్రపిండాలు పాడైపోయినట్లు తేలిందని జూ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జూలో మొత్తం పులులు 18 ఉన్నాయి. అందులో తెల్లపులులు 8 ఉన్నాయి…..

Related posts

హైదరాబాద్‌లో మరో పెట్రోల్ బంక్ వివాదం

TV4-24X7 News

_రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్

TV4-24X7 News

కోట్లు వసూలు చేసిన ప్రైవేట్ లిమిటెడ్ ఉందా…? మూసేశారా?

TV4-24X7 News

Leave a Comment