హైదరాబాద్, షెర్రిగూడ
హైద్రాబాద్ లో మరో పెట్రోల్ బంక్ వివాదం వెలుగుచూసింది. షెర్రిగూడ పరిధిలోని హెచ్పీసీఎల్ బంక్లో నీళ్లు కలిసిన పెట్రోల్ను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి.
నిన్న రాత్రి తన బ్రెజా కారులో పెట్రోల్ నింపించుకున్న మహేష్ అనే వ్యక్తి, ఈ రోజు వాహనం ఆగిపోవడంతో మెకానిక్ వద్దకు వెళ్లగా, ఇంధనంలో నీరు కలిసిందని వెల్లడించారు.
అసలు విషయం తెలుసుకోవడానికి మహేష్ తిరిగి బంక్కు వెళ్లి బాటిల్లో పెట్రోల్ నింపించగా, అందులోనూ నీరు స్పష్టంగా కనిపించడంతో అక్కడే బంక్ సిబ్బందితో ఘర్షణకు దిగారు.
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వినియోగదారులను మోసం చేసే ఇలాంటి బంక్లపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అనూష

