దుబ్బాక: కేవలం ఏడు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విసుగు వచ్చి0దని.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పాలన ఎక్కువ రోజులుండదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వ్యాఖ్యానించారు.సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బుధవారం జరిగిన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో నిధుల్లేక గ్రామపంచాయతీలు మురికి కూపాలుగా మారాయని విమర్శించారు. అభివృద్ధి శూన్యమని, నేరాల సంఖ్య పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇ చ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందన్నారు. రైతుబంధు, పెన్షన్ పెంపు, మహిళలకు గృహజ్యోతి, నిరుద్యోగభృతితో పాటు ఒక్క పథకానికి కూడా దిక్కులేదని పేర్కొన్నారు. ఓపిక పట్టండి.. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. పార్టీ నుంచి ఎవ రు పోయినా ఏం కాదని స్పష్టం చేశారు. బలమైన పునాది ఉన్న బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుని అధికారంలోకి వస్తుందని హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. గిరిజన ఎమ్మెల్యేపై కేసు దుర్మార్గం హైదరాబాద్: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. ప్రొటోకాల్ పాటించకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించినందుకు గిరిజన మహిళా ఎమ్మెల్యేపై కేసు పెట్టడం దుర్మార్గమని విమర్శించారు.

previous post