Tv424x7
Andhrapradesh

హిందూ శ్మశాన వాటిక లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల మున్సిపాలిటీ భీమవరం రస్తా లో ఉన్న హిందూ శ్మశాన వాటిక స్వర్గధామం లో బృందావనం , రాశివనం , నక్షత్రవనం అలా 52 రకాల జాతుల , 3600 మొక్కలు నాటడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు తెలిపారు ఈ సందర్భంగా స్వర్గధామం సేవకులు – నంద్యాల నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటిక లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాయశాఖ మంత్రివర్యులు ఎన్ ఎం డీ ఫరూక్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ గారు మాట్లాడుతూ నంద్యాలలో ఉన్న హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని ఇక్కడ కావాల్సిన అవసరాలు కచ్చితంగా తీరుస్తామని తెలిపారు . అలాగే మన వాతావరణాన్ని కూడా పచ్చదనంగా ఉంటుందన్నారు . ఇక్కడ నాటే మొక్కలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మొక్కను నాటడం జరుగుతుందని ఎవరైతే దహనం చేస్తారో వారి రాశి ప్రకారం ఆ మొక్క దగ్గర వారు పూజలు నిర్వహించుకోవచ్చు అన్నారు అలాగే పండ్ల మొక్కలు , పూల మొక్కలు , తీగ మొక్కలు లాంటివి నాటడం జరుగుతుందని దీనివల్ల శ్మశాన వాటిక పచ్చదనంగా ఉంటుందని తెలిపారు అందరూ శ్మశాన వాటిక అభివృద్ధికి సహకరించాలన్నారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి , మున్సిపల్ చైర్ పర్సన్ మాబునిష , డాక్టర్ మధుసూదన్ రావు , కౌన్సిలర్ కండే శ్యాంసుందర్ లాల్ , కొట్టాల శివ నాగిరెడ్డి , ప్రముఖ పారిశ్రామికవేత రాజారామ్ , రాజేష్ , 2 వార్డు కొమ్ము హరి తదితరులు పాల్గొన్నారు

Related posts

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసుల మృతి

TV4-24X7 News

పదవీ విరమణ పొందిన 10 మంది పోలీస్ అధికారులు

TV4-24X7 News

ఖాజీపేట: ‘ప్రతి పని మాకు తెలిసి జరగాలి

TV4-24X7 News

Leave a Comment