విశాఖపట్నం ఆక్టోబర్ 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నాయకులు అందరూ సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలి. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు/డివిజన్, వార్డు అధ్యక్షులు/ క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్చార్జ్లు/ అబ్జర్వర్ లు, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు ఇతర అన్ని పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలి. నియోజకవర్గంలోని అన్ని ఏరియాలలో కవర్ అయ్యే విధంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేసి (టెస్ట్ మోని యల్స్) సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అని పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గండి బాబ్జి పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.

